Panjab : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ చన్నీ...
ట్వీటర్ లో ప్రకటించిన హారిష్ రావత్....
రిపబ్లిక్ హిందూస్థాన్ , జాతీయం : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ శనివారం రాజీనామా తర్వాత అనిశ్చితి ఆదివారం ముగిసింది. కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం చరణ్ జిత్ చన్నీ ని నియమించారు. ఈ మెరుకు ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హారిష్ రావత్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ తనను పదే పదే అవమానించారని చెబుతూ శనివారం కెప్టెన్ అమరిందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.
నవజ్యోత్ సింగ్ సిద్దు పై కెప్టెన్ ...
నవజ్యోత్ సీంగ్ కు పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. పాక్ మన సైనికులను చంపుతున్నా నవజ్యోత్ సింగ్ సిద్దు పాక్ ఆర్మీ చీఫ్ ను కౌగిలించుకుని దేశ పరువు తీశారని మండిపడ్డారు. దేశ భద్రత విషయం కాబట్టి ముఖ్యమంత్రి గా ఎవర్ని చేసిన పర్వాలేదు. సిద్దూ చేస్తే మాత్రం దేశం కోసమ్ వేరే దారిలో వెళతానని కెప్టెన్ పేర్కొన్నరూ.
https://twitter.com/harishrawatcmuk/status/1439561495780605954?t=D-vAdYkMo0GfI1cZYhRzSg&s=19